జాతీయ విద్యా సంస్థ, తిరుపతి వారిచే నిర్వహించబడిన తెలుగు ప్రతిభా పరీక్షలో శ్రీ ప్రకాష్ విద్యానికేతన్ విద్యార్థిని సి.హెచ్. హేమ వర్షిణి, 5 వ తరగతి, రాష్ట్ర స్థాయి లో మూడవ ర్యాంక్, సాధించింది. గత నెలలో నిర్వహించిన ఈ పోటీలలో రాష్ట్రస్థాయిలో సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులు ఈ పరీక్షలో పాల్గొన్నారు. దీనిలో భాగంగా రాష్ట్ర స్థాయి లో విజయం సాధించిన విద్యార్థినికి రెండువేల రూపాయల నగదుతో పాటు ప్రశంసా పత్రం కూడా అందజేయడం జరుగుతుందని పరీక్షల నిర్వాహకులు తెలిపారు. విద్యార్థినిని శ్రీ ప్రకాష్ విద్యాసంస్థల జాయింట్ సెక్రటరీ శ్రీ చిట్టూరి విజయ్ ప్రకాష్, సీనియర్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం.వి.వి.ఎస్. మూర్తి, ప్రధానోపాధ్యాయురాలు జి. సత్య వర్దిని తదితరులు అభినందించారు